క్రిస్మస్ విందు..ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కొప్పుల

555
koppula eshwar
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ప్రతిఏటా అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా క్రిస్మస్ విందును ఘనంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 20న ఎల్బీ స్టేడియంలో విందు జరగనుండగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. మంత్రితో పాటు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మైనార్టీ శాఖ సలహాదారు ఏకే ఖాన్,క్రిస్టియన్ మైనార్టీ సెక్రటరీ క్రాంతి వెస్లీ,పోలీస్,ఇతర ఉన్నతాధికారులు అధికారులు స్థలాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు.

క్రిస్మస్ వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.33 కోట్లను కేటాయించింది. బట్టల పంపిణీ, విందు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందగా ఈ విందుకు దాదాపు పది వేల మంది హాజరుకానున్నారు.

Minister koppula eshwar Inspects LB Stadium on Christamas celebration works. Minister koppula eshwar Inspects LB Stadium on Christamas celebration works.

- Advertisement -