కాంగ్రెస్‌కు షాక్‌….కొండా గుడ్ బై

367
konda
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడగా తాజాగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు విశ్వేశ్వర్‌రెడ్డి.

విశ్వేశ్వర్‌రెడ్డితో బీజేపీ ఎప్పటి నుండో టచ్‌ లో ఉంది. GHMC ఎన్నికల ఇంఛార్జ్‌గా వచ్చిన భూపేందర్ యాదవ్ ఆయనతో సమావేశం అయ్యారు. అప్పట్లో ఈ పరిణామం కాంగ్రెస్‌ వర్గాల్లోనూ కలవరం రేపింది. అయితే తాజాగా ఆయన పార్టీని వీడటం కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది.

- Advertisement -