సీఎల్పీ మీట్….జగ్గారెడ్డి గడ్డంపై కోమటిరెడ్డి సెటైర్

288
komatireddy
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో నవ్వులు పూయించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎల్పీ సమావేశం జరుగుతుండగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గడ్డంపై సెటైర్ వేసి నవ్వులు పూయించారు.

అందరం మాస్కులు ధరిస్తే…మీపని(జగ్గారెడ్డి) నయం..గడ్డాలు ,మీసాలు పెంచావు.. మాస్క్ కూడా అవసరం లేదంటూ రాజ గోపాల్ రెడ్డి చలోక్తులు విసిరారు. దీంతో సీరియస్ గా సాగుతున్న సమావేశంలో ఒక్క సారిగా నవ్వులు వెల్లివిరిశాయి.

భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన ఈ సీఎల్పీ సమావేశంలో పోతిరెడ్డి పాడు జల వివాదం, కరోనా నివారణలో ప్రభుత్వ వైఫల్యలపై ఈ సమావేశంలో చర్చించారు. సీఎప్పీ సమావేశంలో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -