అందాల రాక్షసికి 3కోట్ల జరిమానా..?

224
- Advertisement -

అసలే లావణ్య త్రిపాఠి కెరీర్‌లో ఈ ఏడాది ‘రాధ’ ‘మిస్టర్’ ‘యుద్ధం శరణం’ లాంటి డిజాస్టర్లు ఎదురయ్యాయి. లావణ్య తాజా సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’ మంచి విజయం సాధించనా ఈ సినిమాలో లావణ్య పాత్రకు ఏమంత మంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో లావణ్యకు అవకాశాలు కష్టమే అన్నట్లుంది పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆమెకు మరో ఎదురు దెబ్బ తగిలినట్లు సమాచారం. తమిళ నిర్మాతల మండలి లావణ్యకు రూ.3 కోట్ల జరిమానా విధించినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

Kollywood Producer's Union Fine Rs. 3 Crore to Lavanya Tripathi

అయితే తమిళంలో ఆల్రెడీ సందీప్ కిషన్ సరసన ‘మాయవన్’ అనే సినిమా చేసిన లావణ్య.. దీని తర్వాత ‘100 పర్సంట్ లవ్’ రీమేక్ కు కూడా ఓకే చెప్పింది. కానీ ఈ సినిమా నుంచి అనివార్య కారణాల వల్ల లావణ్య తప్పుకుంది. ఐతే ముందు కమిట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత లావణ్య షూటింగుకి హాజరు కాలేదని ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆ చిత్ర తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు.

ఈ కేసును పరిశీలించిన నిర్మాతల మండలి లావణ్యదే తప్పు అని తేల్చి ఆమెకు రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు కోలీవుడ్ మీడియా పేర్కొంది. ఐతే ఈ విషయమై లావణ్య నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ వార్త నిజమే అయితే మాత్రం లావణ్యకు అది రెండు విధాలుగా ఎదురుదెబ్బే. రూ.3 కోట్ల జరిమానా కట్టడం పెద్ద విషయమే. పైగా దీని వల్ల వచ్చే చెడ్డ పేరుతో ఆమెకు తమిళంలో ఇంకో ఛాన్స్ దక్కడం కష్టమవుతుంది. అయితే ఈ మూవీలో నుంచి లావణ్య తప్పుకోవడంతో అర్జున్‌రెడ్డి ఫేం షాలినీ పాండేను హీరోయిన్‌గా తీసుకున్నారు.

- Advertisement -