ముంబై హ్యాట్రిక్ పరాజయం…

112
kolkatha
- Advertisement -

ఐపీఎల్‌లో ముంబై హ్యాట్రిక్ పరాజయాన్ని చవిచూసింది. కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ముంబై విధించిన 162 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 16 ఓవర్లలోనే చేధించి సత్తాచాటింది.

కోల్ కతా బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్, ప్యాట్ కమిన్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా పాట్ కమిన్స్ విధ్వంసం సృష్టించాడు. 15 బంతుల్లోనే 56 పరుగులు 6 సిక్సులు, 4 ఫోర్లతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. వెంకటేశ్ అయ్యర్ 41 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్‌ను ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 161 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ 52 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. తిల‌క్ వ‌ర్మ (38), దెవాల్డ్ బ్రెవిస్ (28), కీర‌న్ పొలార్డ్ (22) ప‌రుగులతో రాణించారు.

- Advertisement -