కొడెల మృతి..మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు

418
kodela-son
- Advertisement -

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలది హత్య? ఆత్మహత్యనా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కోడెల మరణంపై సంచలన వ్యాఖ్యులు చేశారు ఆయన మేనల్లుడు. కోడెల శివప్రసాదరావును ఆయన కొడుకు శివరామ్ చంపాడని ఆయన ఆరోపణలు చేశారు.

కొద్ది సేపటిక్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. శివరాం వేధింపులకు గురి చేస్తున్నట్టుగా కోడెల శివప్రసాదరావు మేనల్లుడు సాయి ఆరోపించారు.ఇటీవల కాలంలో వరుసగా నమోదైన కేసుల సమయంలో కోడెలను తాను కలిసినట్టుగా ఆయన చెప్పారు.

కోడెల కూతురు ఇంట్లోనే తాను కోడెల శివప్రసాదరావును కలిసి మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు.ఈ సమయంలోనే శివరాం వేధింపుల గురించి తనకు చెప్పాడన్నారు. అవసరమైతే తన ఫోన్ కాల్ డేటా ను కూడ పరిశీలించుకోవచ్చని కూడ ఆయన కోరారు. ఈ మేరకు కోడెల శివప్రసాదరావు మేనల్లుడు సాయి నర్సరావుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా కాసేపటి క్రితమే కోడెల మృతదేహానికి పొస్టుమార్టం పూర్తయింది. పార్ధివదేహాన్ని ఆయన స్వగృహనికి తరలించనున్నారు.

- Advertisement -