- Advertisement -
ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నియమించిన ప్రొ. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఈమధ్యే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఆ తరవాత న్యాయ సలహా మేరకు ఎమ్మెల్సీల నియామకంపై నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఢిల్లీలోని సుప్రీంకోర్టు న్యాయకోవిదులను సైతం సంప్రదించారు ప్రభుత్వ ముఖ్యులు.
అమీర్ అలీఖాన్ కు బదులుగా క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కు అవకాశం ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read:ప్రదీప్ రంగనాథన్..’డ్యూడ్’
- Advertisement -

