గ‌రుడ‌ వాహనంపై కోదండ‌‌రాముడు

8
- Advertisement -

తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ‌రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు గ‌రుడ‌ వాహనంపై స్వామివారు క‌టాక్షించారు.గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.

గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.వాహ‌న‌సేవ‌లో తిరుమల పెద్దజీయ‌ర్‌స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, విజివో శ్రీ బాలి రెడ్డి, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Also Read:పొట్ట ఉబ్బిందా.. ప్రమాదమే!

- Advertisement -