మొక్కలు నాటిన కేఎల్‌ఎమ్‌ ఫ్యాషన్‌ మాల్ సుభాష్‌..

262
klm fashion mall
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా కూకట్ పల్లి హోసింగ్ బోర్డు శాతవాహన కాలనీ GHMC పార్కు లో మొక్కను నాటారు కేఎల్‌ఎమ్ ఫ్యాషన్ మాల్‌ డైరెక్టర్ సుభాష్.

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని సుభాష్ గారు అన్నారు. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతికి మేలు చేసిన వాళ్ళం అవుతామని అన్నారు.అనంతరం కళామందిర్ కళ్యాణ్ (కాంచీపురం వరమహాలక్ష్మీ సిల్క్స్ – డైరెక్టర్ ) , సోమరాజ్ (CHAIRMAN – SLG హాస్పిటల్) , శైలజ రెడ్డి (బ్రాండ్ అంబాసడర్ ఫార్ సిల్క్ మార్క్ ) గార్లకు ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు సుభాష్‌.

- Advertisement -