ఐపీఎల్‌ ఆరంభం.. టాస్‌ గెలిచిన కేకేఆర్‌..

58
- Advertisement -

శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 15వ సీజన్‌ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో ఇవాళ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌ టాస్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. కోల్ కతా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ ను గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై బ్యాటింగ్ కు దిగింది. ఈ సీజన్‌ నుంచి సీఎస్‌కే, కేకేఆర్‌ జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. చెన్నై జట్టుకు రవీంద్ర జడేజా, కేకేఆర్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ ముందుండి నడిపించనున్నారు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ తుది జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్‌), ఎంస్‌ ధోని (వికెట్‌), డ్వేన్ బ్రావో, ఆడమ్‌ మిల్నే, తుషార్‌దేశ్‌ పాండే, మిచెల్‌ సాంట్నర్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు: అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్‌ కీపర్‌), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శివమ్ మావి, షెల్డన్‌ జాక్సన్‌, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

- Advertisement -