Nagarjuna:#D51లో కింగ్ నాగార్జున

35
- Advertisement -

పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం పవర్‌హౌస్- ధనుష్, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మల్టీ-స్టారర్ #D51 లో జాయిన్ అయ్యారు కింగ్ నాగార్జున అక్కినేని. ఈ మల్టీస్టారర్ చిత్రానికి స్టార్ పెర్ఫార్మర్ కోసం వెతుకుతున్న మేకర్స్ “తన చరిష్మాతో తెరపై వెలుగులు నింపడానికి మన ‘కింగ్ ‘ కంటే ఎవరు బెటర్ ” అని భావించారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ రోజు అనౌన్స్ మెంట్ చేశారు . ఇద్దరి స్టార్స్ అభిమానులు వారి స్క్రీన్ పై చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ )లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Also Read:మోడీ మాస్టర్ ప్లాన్..ఆ భయంతోనేనా?

- Advertisement -