ప్రజల ముందుకు కిమ్..

276
kim
- Advertisement -

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం సరిగా లేదని.. ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కిమ్ ఆరోగ్యంపై రకరకాల పుకార్లు షికార్ చేస్తుండగా వాటికి చెక్ పెట్టేలా కిమ్ ప్రజల ముందుకువచ్చారు.

ఉత్తర కొరియాలో జరిగిన ఓ ఎరువుల కంపెనీ ఓపెనింగ్‌కు కిమ్ హాజరైనట్లు తెలుస్తోంది. కిమ్ రాకతో ఆ దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 11వ తేది నుండి కిమ్ బయటి ప్రపంచానికి కనబడలేదు. గుండె సంబంధిత ఆపరేషన్‌ చేయించుకున్న కిమ్ విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని…ఆయన చనిపోయాడని వార్తలు వెలువడ్డాయి.వీటిని మొదటినుండి ఉత్తరకొరియా ఖండిస్తూ వచ్చిన పుకార్లు మాత్రం ఆగలేదు. తాజాగా కిమ్ ప్రజల ముందుకు రావడంతో ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది.

- Advertisement -