మహేశ్బాబు – కొరటాల శివ శివకాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు భరత్ అను నేను టైటిల్ని ఖరారు చేయగా ఇటీవలె చిత్ర యూనిట్తో జైన్ అయ్యారు మహేష్. బాలీవుడ్ భామ కైరా అడ్వానీ మహేశ్ సరసన నటిస్తున్నారు. ఆమె తెలుగులో చేస్తున్న తొలి చిత్రమిది.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ బేగంపేటలో జరుగుతోంది. కాగా మంగళవారం నుంచి కైరా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మహేశ్-కొరటాల కాంబినేషన్లో ‘శ్రీమంతుడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయం సాధించడం వల్ల దీనిపై ఎక్కువ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనుండగా శరత్కుమార్ మహేశ్ తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కూడా ఈ సినిమాలో ఒక క్యారక్టర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను జనవరి 2018లో సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.