ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలి: మంత్రి కేటీఆర్

110
- Advertisement -

అభివృద్ధి చెందిన ఖమ్మం నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా పని చేయాలని నూతనంగా ఎన్నికైన మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా కు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో నూతన మేయర్, ఉప మేయర్ లు మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి కేటీఆర్‌ వారికి పుష్పగుచం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.

మంత్రి పువ్వాడ అజాయ్ కుమార్ ఆధ్వర్యంలో నగరం చాలా అభివృద్ధి చెందిందని, దానిని కొనసాగింపుగా మీ వంతు కృషి చేసి మరింత అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేయాలన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -