ఖైర‌తాబాద్‌ గ‌ణేశుడి ప్ర‌తిమ‌ నమూనా ఆవిష్కరణ..

108
ganapathi
- Advertisement -

హైదరాబాద్‌లో వినాయ‌క చ‌వితి సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆవిష్కరించారు. 50 అడుగుల భారీ మట్టి విగ్రహ రూపాన్ని ఈ ఏడాది ఆవిష్కరించారు.

మ‌ట్టి గ‌ణప‌తుల వినియోగాన్ని ప్రోత్స‌హించాల‌న్న ప్ర‌భుత్వ పిలుపుతో తొలిసారి మట్టితో ఖైరతాబాద్ మహా గణపతిని తయారు చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ భారీ గణేశుడు పంచముఖ లక్ష్మీగణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణనాథునికి ఎడమ వైపు త్రిశక్తి మహాగాయత్రి దేవి, కుడి వైపు సుబ్రమణ్యస్వామి ప్రతిమ ఉండనుంది. నిమజ్జనానికి తరలివెళ్లేలా మట్టి విగ్రహాన్ని తయారు చేయనున్నారు.

- Advertisement -