ఆసీస్‌తో ఓకే కానీ ఇంగ్లాండ్‌తో జాగ్రత్త: పీటర్సన్

173
Kevin
- Advertisement -

సొంతగడ్డపై ఆసీస్‌ని మట్టికరిపించిన భారత్‌ చరిత్ర తిరగరాసింది. ఈ నేపథ్యంలో భారత్‌ను హెచ్చరించాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌. ఆసీస్‌పై భారత విజయాన్ని అభినందిస్తూనే హెచ్చరికలు జారిచేశాడు. వచ్చేనెలలో ఇంగ్లాండ్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో భారత్ జాగ్రత్తగా ఉండాలని తెలిపాడు.

ఆసీస్ పై విజయానికి ఎక్కువగా సంబరాలు జరుపుకోకండి… ఇంగ్లాండ్ తో టెస్ట్ కు సిద్ధంగా ఉండండి అని హెచ్చరించాడు. ఇంగ్లాండ్‌….భారత పర్యటనలో 4 టెస్ట్, 3-వన్డే మరియు 5 టీ 20ల సిరీస్ లను ఆడనున్నారు.

- Advertisement -