ఈవీఎంల గోల్‌మాల్‌..కేతిరెడ్డి వీడియో

12
- Advertisement -

ఏపీలో ఈవీఎంల గోల్ మాల్ జరిగిందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. 362 నియోజకవర్గాల్లో ఐదు లక్షల 54వేల ఓట్లు గల్లంతయ్యాయని తన ఫేస్ బుక్ ద్వారా వివరాలు వెల్లడించారు.

ఏమాత్రం అవగాహనలేని అశ్వినీదత్, కేకే, ప్రశాంత్ కిషోర్ 160 సీట్లు వస్తాయని ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. ఏపీ, తమిళనాడుతో సహా దేశవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో ఈవీఎంలను మార్చేశారని ఆరోపించారు. పోలైన ఓట్లకు ఈవీఎంలలో ఓట్లకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు.

కౌంటింగ్ ప్రారంభమైన గంటలోపే 150 సీట్లు కూటమికి వచ్చాయని ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. ఏజెంట్లు బయటకు వెళ్లాలని ఇలాంటి దుష్ర్పచారం చేశారని ఆరోపించారు.

Also Read:షాతో వివాదంపై తమిళి సై క్లారిటీ!

https://fb.watch/sHKEKOhmw-/

- Advertisement -