- Advertisement -
సౌదీలో నివసిస్తున్న కేరళ వ్యక్తికి అదృష్టం కలిసివచ్చింది. గత 15 ఏళ్లుగా లాటరీ కొంటున్న కేరళకు చెందిన రాజన్ ఏకంగా రూ. 60 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. అబుదాబిలో జరిగిన Big Ticket Abu Dhabi drawలో 25 మిలియన్ దిర్హామ్ — అంటే భారతంలో సుమారు రూ. 60–61 కోట్లు గెలిచాడు.
లాటరీ గెలిచిన ఆనందాన్ని తన స్నేహితులతో పంచుకున్నారు రాజన్. తొలుత సరదాగా లాటరీ టికెట్ కొనుగోలు మొదలైందని ఇలా 15 ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నట్లు తెలిపారు రాజన్.
దాదాపు 15 ఏళ్ల తర్వాత తన ప్రయత్నం సక్సెస్ కావడంతో రాజన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను గెలుచుకున్న ప్రైజ్ మనీలో కొంత ఛారిటీకి ఇస్తానని తెలిపారు.
Also Read:కాలంతో పాటే కరిగిపోతున్న స్నేహ బంధాలు!
- Advertisement -

