దేశ రైతులకు సెల్యూట్: స్టాలిన్, కేజ్రీవాల్

63
kejriwal
- Advertisement -

ప్రకాశ్ దివస్ నాడు మంచి వార్త విన్నామని..రైతులకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కేంద్రం రైతు చట్టాలను రద్దు చేయడంపై స్పందించిన కేజ్రీవాల్..మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందన్నారు. ఈ ఉద్యమంలో 700మందికి పైగా రైతులు ప్రాణత్యాగం చేశారు…వారి త్యాగాలకు ఫలితం దక్కిందన్నారు.వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఈ దేశ అన్నదాతలు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరును భవిష్యత్తు తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయన్నారు.

మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాని నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని తెలిపారు తమిళనాడు సీఎం స్టాలిన్. ప్రజాస్వామ్యంలో ప్రజల కోరికలు నెరవేరుతాయని చరిత్ర మనకు బోధిస్తోందన్నారు. గాంధేయ మార్గాల ద్వారా దీనిని సాధించినందుకు రైతుల సంకల్పాన్నీ అభినందిస్తున్నానని తెలిపారు.

- Advertisement -