మరో బయోపిక్‌లో కీర్తి..?

200
Keerthy Suresh's look from Jayalalitha's biopic..?
- Advertisement -

కీర్తి సురేష్‌ గతంలో పవన్ కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో నిరాశలో పడిపోయింది. తెలుగు పరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలోనే ఈ అమ్మడుకి ‘మహానటి’ ప్రాజెక్ట్‌ తన్నుకొచ్చింది.

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్ర పోషించింది కీర్తీ. ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్, సమంత, మోహన్‌బాబు, అవసరాల శ్రీనివాస్, విజయ్ దేవరకొండ తదితరులు నటించారు. ‘ఎవడే సుబ్రహ్మాణ్యం’ సినిమాతో దర్శకుడిగా మారిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తుంది. వైజయంతీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ సినిమా విడుదలకు సిద్దమైంది.

Keerthy Suresh's look from Jayalalitha's biopic..?

ఇక విషయాకొస్తే సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్‌కి మరోక బంపర్ ఆఫర్ వచ్చినట్లు సినీ వర్గాల్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కించే పనిలో ఉన్నారట. ఇక ఈ సినిమాలో జయలలిత పాత్ర కోసం కీర్తిని సంప్రదించినట్లు సమాచారం. జయలలిత సినీ పరిశ్రమ నుంచి రాజకీయ రంగంలో అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఒకవేళ జయలలిత జీవిత చరిత్రను తెరపై చూపించే ప్రయత్నం చేస్తే ఇందులో కీర్తి సురేష్‌ నటిస్తుందో లేదో చూడాలి. మరి ఇంతకు ఈ వార్త నిజమేనా..అబద్దమా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

- Advertisement -