కీర్తి మూవీకి సపోర్ట్‌గా నలుగురు హీరోయిన్స్‌..!

366
Keerthy Suresh Penguin
- Advertisement -

మ‌హాన‌టి చిత్రంతో నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ఇటు తెలుగు అటు త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తుంది. ఈ మహాన‌టి తాజాగా నటించిన చిత్రం ‘పెంగ్విన్’.థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకానుంది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకంపై కార్తీక్ సుబ్బ‌రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈశ్వ‌ర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్‌ను జూన్ 8న రిలీజ్ కానుంది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందించారు. మలయాళంలోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూడు టీజర్లను ఒకేసారి విడుదల చేస్తున్నారు చిత్ర బృందం.

అయితే ఈ మూడు టీజర్లను స్టార్ హీరోయిన్లు లాంఛ్‌ చేయనున్నారు. తాప్సీ ప‌న్ను, స‌మంత‌, మంజు వారియ‌ర్, త్రిష ‘పెంగ్విన్’ టీజ‌ర్‌ని జూన్ 8న త‌మ ట్విట్టర్ ఖాతాల ద్వారా విడుద‌ల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రక‌టించింది.

- Advertisement -