గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సినీ నటి కీర్తి సురేష్

389
keerthi Green Challeange
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గోంటున్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్. సూరారం టెక్ మహీంద్ర క్యాంపస్ లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గోని మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు, గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -