- Advertisement -
‘నేను శైలజ’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ కీర్తి సురేష్. తొలి సినిమాతోనే తెలుగువారి మనసు దోచుకున్న కీర్తి …తర్వాత నాని హీరోగా వచ్చిన ‘నేను లోకల్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక మహానటి మూవీతో విమర్శకుల ప్రశంసలు పొందిన కీర్తి ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది.
ప్రముఖ బీజేపీ నాయకుడి కుమారుడిని కీర్తి సురేష్ పెళ్లాడబోతుందని..ఈ ఏడాది చివరలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన విషయాన్ని వెల్లడించారు ప్రముఖ పాత్రికేయుడు, నటుడు ఫూల్వాన్ రంగనాథన్.
కీర్తిని పెళ్లాడబోయే ఆ వ్యాపారవేత్త ఎవరు? వివాహం ఎప్పుడు ఉంటుందనేది తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కీర్తి కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
- Advertisement -