అనుష్కలా ఇబ్బందులు తెచ్చుకోను !

188
keerthy suresh goes for prosthetic
keerthy suresh goes for prosthetic
- Advertisement -

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల కోసం హీరోయిన్లు తమ శరీరాన్ని కొంత మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ పాత్ర కోసం బరువు పెరగడమో లేదా తగ్గడమో చేయాల్సి ఉంటుంది. బాహుబలి ఫేమ్ అనుష్క సైజ్‌ జీరో కోసం బాగానే బరువు పెరగాల్సి వచ్చిందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత సినిమాల కోసం అనుష్క బరువు ఇప్పటికీ తగ్గలేకపోయింది. అనుష్క పడ్డ పాట్లు చూసి మిగతా హీరోయిన్లు బరువు పెంచుకోవడానికి జంకుతున్నారు. సినిమాలను వదులుకుంటున్నారు కానీ.. బరువు పెరగడానికి మాత్రం నో చెప్పేస్తున్నారు.

ఇక రెండు సినిమాలతోనే తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌. ప్రస్తుతం ఈమె మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమాలో నటిస్తోంది. సావిత్రి నిజ జీవిత పాత్రను పోషిస్తోంది. మహానటి సావిత్రి కాస్త బొద్దుగా ఉంటారనే విషయం తెలిసిందే. దీంతో కీర్తి సురేష్‌తో పదిహేను కిలోల బరువు పెరగాలని చెప్పిన దర్శకుడు ఆమె సూచించాడట. కీ్ర్తి మాత్రం సారీ.. నేను బరువు పెంచుకోవడానికి సిద్దంగాలేనని చెప్పేసిందట. అవసరమైతే ప్రోస్థటిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో మేనేజ్‌ చేసుకోండని, బరువు పెరిగేదే లేదని చెప్పిందట. కీర్తి సురేష్‌ హీరోయిన్‌ అయితే తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా ఈజీగా మార్కెట్‌ చేసుకోవచ్చునని మిగతా వారిని కాదని ఆమెకి అవకాశమిచ్చారు.

కాగా, సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడట. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ పతాకంపై సమర్పిస్తున్నారు.

- Advertisement -