అయోమయంలో శైలజ..!

353
Keerthi for adults only
- Advertisement -

‘నేను శైలజ’ సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన కీర్తి సురేష్‌.. ‘నేను లోకల్‌’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. వరుసగా అగ్రహీరోల సరసన వస్తున్న అవకాశాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అలాంటి కీర్తికి పవర్ స్టార్ సరసన నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడు ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. తర్వాత మరో రెండు సినిమాలకు కమిట్ కావడంతో కెరీర్‌ మళ్లీ గాడిలో పడిందనుకుంటుండగానే ఈ భామకు అసలైన సమస్య వచ్చిపడింది.

పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ ఎంపికైంది. అదే సమయంలో మహానటి సావిత్రి సినిమాలో చేయడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆమెను తీసుకున్నాడు. సావిత్రి లావుగా ఉండేది కనుక .. మరికాస్త బరువు పెరగమని కీర్తి సురేష్ తో నాగ్ అశ్విన్ చెప్పాడట. ఇక పవన్ – త్రివిక్రమ్ తమ సినిమా కోసం కాస్త బరువు తగ్గమని ఆమెతో అన్నారట. ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లనుండటంతో, ఏం చేయాలో పాలుపోక ఆమె అయోమయానికి లోనైందని అంటున్నారు.

ఇక పవన్‌తో నటించే అవకాశం కొట్టేసిన ఈ చిన్నది ప్రిన్స్ మహేష్‌తో నటించే అవకాశాన్ని మరోసారి మిస్ చేసుకుంది. కొరటాల శివతో మహేష్ మరో క్రేజీ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి కన్ఫామ్‌ అనుకుంటున్న దశలో చేదు అనుభవమే ఎదురైంది. గతంలో మహేష్‌-మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకు కూడా ముందు కీర్తినే అనుకున్నారు. అయితే అనూహ్యంగా రకుల్‌ ఆ ఛాన్స్‌ దక్కించుకుంది. ఇప్పుడు రెండోసారి కూడా మహేష్‌ సరసన కనిపించే అవకాశం దక్కించుకోలేకపోయింది కీర్తి.

- Advertisement -