యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు…

273
cm kcr
- Advertisement -

యాదాద్రి పర్యటనలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బాలాలయంలో ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్. దర్శనం అనంతరం సీఎం కేసీఆర్‌ ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించారు. దేశానికే తలమానికంగా చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. త్వరలోనే స్తంభోద్భవుని దర్శనభాగ్యం భక్తులకు కలగనున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది.

రూ.1200 కోట్లతో పంచనారసింహ క్షేత్రం పునః నిర్మాణ పనులను 2016 అక్టోబర్‌ 11న ప్రారంభించారు. కృష్ణశిలతో నిర్మించిన ఆలయం 4.33 ఎకరాల్లో అద్భుత గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు, ఆళ్వారులతో ఆలయం అలరాలుతోంది.

- Advertisement -