- Advertisement -
ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ వేములవాడ అలయాన్ని సందర్శించారు. శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు..
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.
- Advertisement -