ఒంట‌రిగానే అధికారంలోకి టీఆర్ఎస్ః అసదుద్దీన్ ఓవైసీ

297
asadiddin
- Advertisement -

రేపు జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ లో టీఆర్ ఎస్ పార్టీ, ఒంటిరిగానే ఎవ‌రి మ‌ద్ద‌తు లేకుండా అధికారంలోకి వ‌స్తుంద‌న్నారు ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ. మ‌ధ్యాహ్నాం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయిన ఆయ‌న సాయంత్రం మీడియాతో మాట్లాడారు. పూర్తి మెజార్టీతో టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడనుందని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీల మద్దతు టీఆర్ఎస్ కు అవసరం లేదన్నారు. ప్ర‌జలు కేసీఆర్ ను మరోసారి దీవించారని, టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము 8 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని అన్నారు. తమ మద్దతు ఎప్పుడూ టీఆర్ఎస్ కే ఉటుందన్నారు. తెలంగాణ‌లో కేసీఆర్ మ‌రోసారి సీఎం కావాల‌న్నారు. భారతీయ జనతా పార్టీ బలమేంటో రేపు తేలిపోతుందన్నారు.

- Advertisement -