కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తాం:మండవ

565
mandava kavitha
- Advertisement -

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు మాజీ మంత్రి,టీఆర్ఎస్ నేత మండవ వెంకటేశ్వర్ రావు. నిజామాబాద్‌లో ఎంపీ క్యాంప్ కార్యాలయంలో కవితతో కలిసి మీడియాతో మాట్లాడిన మండవ తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరానని తెలిపారు.

టీఆర్‌ఎస్‌లో ఉన్న నేతలంతా ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన వారేనని తెలిపారు.పదవుల కోసం పార్టీలో చేరలేదని, కవిత గెలుపులో తాను భాగస్వామ్యం అవుతానన్నారు. ప్రచారంలో ముందంజలో ఉన్న కవితకు.. జిల్లా ప్రజలు మద్దతుగా ఉన్నారని, అన్నివర్గాల సంఘీభావం లభిస్తున్నదని తెలిపారు. అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారని కొనియాడారు. పదహారు ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలవబోతుందని, ఈ ట్రెండ్ ముందే సెట్ అయ్యిందని మండవ అన్నారు.

మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ మరింత బలోపేతమైందని కల్వకుంట్ల కవిత అన్నారు. మండవ వెంకటేశ్వర్ రావు ,సీఎం కేసీఆర్‌ మధ్య సాన్నిహిత్యం ఉందని, కేసీఆర్ ఆహ్వానం మేరకు మండవ వెంకటేశ్వర్‌రావు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న మంచి పనులను కొనసాగించే విధంగా టీఆర్‌ఎస్ పార్టీకి బలం ఇవ్వడమనేది ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.

- Advertisement -