ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌: కేసీఆర్‌

293
- Advertisement -

హైదరాబాద్‌ నగరంలోని బంజారా హిల్స్‌లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంట్రల్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖి చేశారు. 7 ఎకరాల విస్తీర్ణంలో, 20 అంతస్తులు,5లక్షల చదరపు అడుగుల నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా జరుగుతుండడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కోరారు.

CM KCR

కేవలం శాంతి భద్రతల పర్యవేక్షణకే కాకుండ విపత్తుల నిర్వహణ, పండుగలు-జాతరల నిర్వహణ తదితర కార్యక్రమాలను కూడా కమండ్ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించవచ్చని సీఎం అన్నారు. దేశంలో మొదటి సారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఇతర రాష్ట్రలకు ఆదర్శంగా నిలుస్తుందని, ఆధునిక సాంకేతిక పారిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తుందని సీఎం చెప్పారు.

CM KCR

ముఖ్యమంత్రి వెంట హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఆరోగ్య శాఖ మంత్రి సి. లక్ష్మా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, చీఫ్ సెక్రటరీ ఎస్‌.కె. జోషి, డి.జి.పి. మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆరూరి రమేష్, గంగుల కమలాకర్, అరికెపూడి గాంధీ, సంజీవరావు, ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇ.ఎన్‌.సి గణపతి రెడ్డి తదితరులువచ్చారు.

- Advertisement -