KCR:దళిత,బహెజనులు ఏకంకావాలి

17
- Advertisement -

మానవ పరిణామ క్రమంలో జరిగే గుణాత్మక పురోభివృద్ధి వెనక ఎందరో మహనీయుల త్యాగాలు కృషి ఉన్నది..తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాల క్రమం కూడా అలాంటిదే అన్నారు మాజీ సీఎం కేసీఆర్. బీఎస్పీకి రాజీనామా చేసిన బీఆర్ఎస్‌లో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు వందలాది మంది పార్టీలో చేరగా వారందరికి కండువా కప్పి ఆహ్వానించారు. మీరు బీఎస్పి నుంచి వచ్చినవాళ్లు మీ మనసులో ఏముంటదో నాకు తెలుసు అన్నారు.ఈ సందర్భంగా మీకు కొన్ని చారిత్రక విషయాలు చెప్పాలి…నాటి స్వాతంత్ర్య సాధన అనంతరం నెహ్రూ ఆద్వర్యంలో సాగిన నూతన ప్రభుత్వం లో నాటి సంస్థానీదేశులు దేశ్ముఖ్లే గాంధీ టోపీలు పెట్టుకుని ప్రజా ప్రతినిధులైండ్రు అన్నారు.

1969 ఉద్యమంలో ముల్కీ రూల్స్ కోసం పోరాటం సాగింది..సుప్రీం కోర్టు కొనసాగించాలని చెప్పినా జై ఆంధ్ర ఉద్యమం తెచ్చి అనంచివేసింద్రు..400 మంది చనిపోయిండ్రు… ఆ తర్వాత తెలంగాణ చైతన్యం ఆగమైందన్నారు.మనకు ఏమన్న ఎటమాటమైతే డీలా పడిపోవడం అలవాటేగా…అట్లా నాడు ఉద్యమం సల్లపడింది..తెలంగాణ అశక్త అయిపోయి అసహాయ పరిస్థితిలో అన్నీ పార్టీల్లో మన నాయకులు బానిసలైపోయిండ్రు…ఆంధ్రపాలకులకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే అణచివేత పరిస్థితి ఉండే నాడు అన్నారు.

నాకు 69 నుంచే తెలంగాణ మనసులో ఉంది…అనంతర కాలం లో అనేక అనుభవాలు ఉన్నాయ్..కష్టాలు ఎదుర్కున్న…ఒక్కరికి కూడా సోయి లేకుండే… తెలంగాణ కోసం పోదాం పా అంటే నువ్వంటవు గానీ అయితాదే” అని ఎనకపట్లు పడేవాళ్లు అన్నారు. (నాటి ఉమ్మడి పాలనలో కరెంటు సహా తెలంగాణ కు జరిగిన వివక్ష మీద తాను చేసిన పోరాటం.. ఎన్టీఆర్ హయాం లో ప్రజాప్రతినిధిగా మంత్రిగా తాను పరిష్కరించిన సమస్యలను ఎదురించి నిలిచిన పలు సందర్భాలను వివరించారు కేసీఆర్..).

అనంతరం చంద్రబాబు హయాం లో ఆయనకు ప్రపంచ బ్యాంకు పిచ్చి పట్టుకుంది.. ఆర్థిక సంస్కరణలు అమలుచేయాలని చూసేవాడు..తాగునీరు విద్యుత్ వంటి ప్రజలకు సంక్షేమం అక్కరలేదనే భావన ఆయనకు ఉండేది..విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు వ్యతిరేకంగా నేను రాజీనామా చేశానని అన్నారు. అనంతరం విద్యుత్ ఉద్యమ కారులను కాల్చి చంపేసిండ్రు..మనం ఎన్ని విజ్ఞప్తులను నిర్లక్ష్యం చేసినాడు… దానికి నాకెంతో మానస్తాపం చెందిన తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాలని నిర్ణయించిన..నాటి 69 ఉదామకారులతో చర్చలు మొదలుపెట్టి..ఇది స్ట్రీట్ ఫైటా..స్టేట్ ఫైటా అని అడిగిన వారిని..దేశంలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఎందో తెల్వకుంటా రాళ్లు పట్టుకొని ఎంతదూరం ఉర్కూతం అన్నారు.

పార్లమెంటులో చట్టం చేస్తే తప్ప రాదు అన్నప్పుడు అటువంటి విధానమే అనుసరించాలి..బహుజన సిద్ధాంతం మీద ఇంకా లోతుగా చర్చ జరగాలి..విపరీతమైన మేధోమథనం జరగాలి..స్పష్టమైన అవగాహన వచ్చేదాకా. 14 ఏండ్లు రాష్ట్ర సాధనకోసం 10 ఏండ్లు ప్రగతి సాధన కోసం నా ఉద్యమం సాగింది…
కోటానుకోట్ల బహుజనులకు చైతన్య స్రవంతి కోసం మీరు ఆలోచన చేసినవాళ్లు.. మనకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలి..ఒకసారి కమిట్ అయినంక వెనక్కు రావద్దు అన్నారు. ఈనడుమ జరిగిన రివ్యూ లో మనవాళ్లు చెప్పిన అంశాలు ఆశ్చర్యం కలిగించిందన్నారు.

దళిత బంధు పథకం తో మనకు దెబ్బ పడ్డదని అంటున్నారు కానీ అట్లాంటి ఆలోచన సరికాదు…దళిత బంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయి..దళిత సమాజం దీన్ని పాజిటివ్ గా ఎందుకు తీసుకోలేకపోయిందో బహుజన యువ మేధావులు విశ్లేషించాలన్నారు.దళిత శక్తి తో పాటు బహుజన శక్తి కలిసిపోవాలే అనే సిద్ధాంతం కోసం కాన్షీరాం పోరాటం చేసిండు..దాన్ని మనం కోమసాగించాలే అన్నారు.

బహుజనుల్లో సామాజిక చైతన్య స్థాయి ని మరింతగా పెంచాల్సి ఉందని…కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాడులు జరిగేది దళితుల మీదనే అన్నారు. పాలకుల మీద ఐకమత్యం తో పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలే..కలెగలిసి పోవాలంటే ఏంచేయాలో ఆలోచన చేయాలి..అగ్రవర్ణాల్లోని పేదలతో కూడా కలుపుకు పోవాలి…ప్రతీప శక్తులమీద పోరాడుతూనే కలిసివచ్చే శక్తులను కలుపుకపోవాలి..వారి శక్తిని మనం ఉపయోగించుకోవాలన్నారు.

20 శాతం ఉన్న దళితులు ఐక్యంగా నిలబడితే సాధించలేనిదే మీ లేదు…రాజకీయాల్లో అనేక కష్టాలు వస్తాయి. తట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలి.ఇండియా లో ఏరాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టలే.. దేశానికే ఆదర్శంగా మన సచివాలయానికి డా బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినం అన్నారు.తెలంగాణ ఉద్యమ ప్రస్థానం లో నేను తిన్న తిట్లు ఎవరూ తినలే… నా మీద దండకాలు కూడా రాసిండ్రు… ఎన్ని కష్టాలెదురైనా ప్రలోభాలు పెట్టినా తెలంగాణ వాదాన్ని వదల్లేదు అన్నారు.

అవసరమైన పంథా ను ముందుపెట్టి తెలంగాణ కోసం పోరాటం లో కేంద్రాన్ని గజ్జున వణికించినం..శూన్యం నుంచి సుడిగాలి ని సృష్టించినం.. గిటువంటి సమస్యలెన్నో చూసినం ఇదో లెక్కగాదు..మీలాంటి యువత నాయకత్వం ఎదిగితే.. ఈ చిల్లర వచ్చిపోయే వాళ్ల ఇట్లాంటి స్వార్థ పరుల అవసరం వుండదు..వచ్చే ఎన్నికల వరకు మీరంతా నాయకులుగా ఎదగాలే అన్నారు. దేశంలో ఇంతవరకూ దళిత బంధు వంటి పథకాన్ని తేలే ఎవ్వరూ..అనేక చర్చలు మేధోమథనం అనంతరమే రైతుబంధు తెచ్చినం అన్నారు.

సాగునీటి ప్రాజెక్టులను తెచ్చినం తద్వారా రాష్ట్రంన్లో మూడు కోట్ల టన్నులకు ధాన్యం ఉత్పత్తి చేరుకుంది.నాటి ఉద్యమ కాలం లో అనివార్యంగా కొన్ని మాటలు అనాల్సి వచ్చిందే తప్ప …నెరీ ఇట్లా ఎట్లబడితే అట్లా అసభ్యంగా బూతు కూతలకు దిగలే..నేను పరుష పదాలతో దురుసు మాటలతో తిట్టలేదు అన్నారు. పబ్లిక్ లైఫ్ అన్నప్పుడు ఓడినా గెలిచినా ఒక్కతీరుగా వుండాలే..మన ప్రజలు మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకుసాగాలె.. అధికారం ఉంటే ఒకతీరు లేకుంటే ఓ తీరు ఉండొద్దు అన్నారు.

అగాధం లో ఉన్న తెలంగాణ కు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది..ఇవి ఎక్కడ పోవు.. వచ్చేటయిన ఎక్కువిస్తాడేమో నని ఆశకు పోయి మోసపోయిండ్రు..కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలకు నమ్మి అటు మల్లిండ్రు…ఇప్పుడు ప్రజలకు అర్థమైతున్నది వాస్తవం..ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు.. గాడిది ఏమ్మటి పోతేనే గదా గుర్రాల విలువ తెలుసుద్ది అన్నారు.

Also Read:బీఆర్‌ఎస్‌లో చేరిన బీఎస్పీ నాయకులు వీరే

- Advertisement -