హరికృష్ణ పార్థివదేహానికి సీఎం కేసీఆర్‌ నివాళి..

265
KCR
- Advertisement -

సీఎం కేసీఆర్ హరికృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఇవాళ మధ్యాహ్నం మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు కేసీఆర్‌. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు చేరుకున్నారు.

సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు..హరికృష్ణ నివాసంలోకి తీసుకెళ్లారు. అనంతరం హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్, హరికృష్ణ మృతితో శోకసంద్రంలో మనిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్‌ పరామర్శించారు. కాగా..పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు తరలివస్తున్నారు.

- Advertisement -