ముగిసిన కేసీఆర్‌-గవర్నర్‌ల సమావేశం..

263
- Advertisement -

ఏపీ,తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి నిన్న గవర్నర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, సానుకూల వాతావరణం కోసం ఈ ఇద్దరు సీఎంలు గవర్నర్‌తో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

KCR

కాగా ఈ రోజు సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ ఆయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. నిన్న గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ చర్చించారు.

- Advertisement -