KTR:తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష

2
- Advertisement -

తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష అన్నారు కేటీఆర్. ఆదిలాబాద్‌లో జరిగిన రైతు మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్…కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్ హయాంలో మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై లక్షా రూపాయలకు పైగా ఖర్చు చేశారు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మకండి…. కేసీఆర్ అందరి కోసం పనిచేస్తారు అన్నారు.

నల్గొండ జిల్లా రామన్నపేట వద్ద అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తే అక్కడి ప్రజలు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ర్యాలీ చేశారు…సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపై కూడా అదానీ కన్ను పడింది. ఇక్కడ కూడా అదే ప్రయత్నం జరుగుతుందన్నారు. బెల్లంపల్లి, ఆదిలాబాద్, సింగరేణిపై కూడా అదానీ కన్ను ఉంది. దాన్ని గుత్తకు పెట్టారు. అందుకే మనం గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

రాహుల్ గాంధీ చౌకిదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం మోడీ మేరా బడే భాయ్ అంటాడు…అదానీ ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ అంటే… రేవంత్ రెడ్డి మాత్రం అదానీ మేరా దోస్త్ అంటాడు అన్నారు. పైన తిడుతారు.. కింద మాత్రం దోస్త్ చేస్తారు. కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు…రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేసి నేను అదానీని తిడుతుంటే నువ్వెందుకు దోస్త్ చేస్తున్నావని అని అడగవచ్చు కదా? అన్నారు. ఈ దొంగల నుంచి తెలంగాణను కాపాడుకోవాలంటే ఉన్నది ఒక్క కేసీఆర్ మాత్రమే…తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ బాటలో నడుద్దాం అన్నారు.

Also Read:Jagan:డైవర్షన్ పాలిటిక్స్ ఇంకెన్నాళ్లు?

- Advertisement -