లండన్‌లో ఘ‌నంగా కేసీఆర్ – దీక్షా దివస్

32
- Advertisement -

లండన్‌లో కేసీఆర్ – దీక్షా దివస్ ని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు.నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టంగా బావించి, ఆ రోజును దీక్ష దివస్ గా జరుపుకుంటున్నామన్నారు. ‘తెలంగాణ వచ్చుడో -కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదం తో తల పెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టం అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి, శాంతి యుత పోరాటం తో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారి ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు. నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ గారు ఎంచుకున్న అహింసా పద్దతిని మన తెలంగాణ గాంధీజీ – కేసీఆర్ గారు పాటించి రాష్ట్ర సాధనోద్యమంలో ఎటువంటి హింసకు తావు లేకుండా, శాంతియుత పంధా తో ఏదైన సాధించవచ్చు అనే గొప్ప సందేశాన్ని, అటు భారత దేశ పౌరులకే కాకుండా, ప్రపంచానికే గొప్ప సందేశాన్నీ, మార్గాన్ని చూపిన గొప్ప స్పూర్తి దాత నాయకుడు మన కేసీఆర్ గారని ప్రశంసించారు.

ఉద్యమ నాయకుడే నేడు సేవకుడిగా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టమని, బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిశలూ శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీ.ఆర్.యస్ సెల్ సభ్యులు రవి ప్రదీప్ పులుసు, రవి రేటినేని, సురేష్ గోపతి, హరి గౌడ్ నవాపేట్, సతీష్ రెడ్డి బండ, మల్లారెడ్డి బీరం, వెంకట్ రెడ్డి దొంతుల, ప్రశాంత్ కటికనేని, శ్రీకాంత్ జెల్లా, నవీన్ భువనగిరి, అబ్దుల్ జాఫర్, గణేష్ కుప్పల,ప్రశాంత్ మామిడాల, రామకృష్ణ మరియు ముఖ్య సభ్యులు శుషుమ్న రెడ్డి, క్రాంతి రేటినేని,సుప్రజ పులుసు, స్నేహ నవాబుపేట్, మట్టా రెడ్డి, నవీన్, అంజన్ రావు, శశి, నరేష్ జక్కుల హాజరైన వారిలో వున్నారు.

Also Read:మ్యాక్స్‌వెల్.. ఊచకోత

- Advertisement -