KCR:తెలంగాణపై మోడీ సవతి తల్లి ప్రేమ?

14
- Advertisement -

తెలంగాణపై మోడీది సవితి తల్లి ప్రేమ అని మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కామారెడ్డి గడ్డపై అడుగడుగునా అపూర్వ స్వాగతం తెలిపారు ప్రజలు.గులాబీ వనంగా మారిన కామారెడ్డి జిల్లా కేంద్రం.. రోడ్‌ షోకు అద్భుత స్పందన వచ్చింది.

కామారెడ్డి జిల్లాగా కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణపై మోడీది సవతి తల్లి ప్రేమ..మన తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేసిన బీజేపీకి ఓటెందుకు వేయాలి? ఆలోచించాలన్నారు. రైతుబంధును ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధుపై కుట్ర చేసి రాకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాగా కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గెలవాలన్నారు.

అచ్చేదిన్ రాలేదు కానీ సచ్చే దిన్ వచ్చినయి, సబ్కా సాత్ కాలేదు గానీ సబ్కా సత్య నాశ్ అయిందన్నారు. ప్రధాని ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నాడు ,వచ్చినయ.?పదిహేను లేదు పాసు లేదు, మోడీ గోదావరిని ఎత్కపోతంటే సుద్దమా యుద్దం చేద్దామా .? అన్నారు.

Also Read:ఇవి పాటిస్తే మీ ఆరోగ్యం ప‌దిలం..

- Advertisement -