చిల్లర సంఘాలు అన్నవారికి ఇది చెంపపెట్టు.: టీఎన్జీవో

123
cm kcr
- Advertisement -

చిల్లర సంఘాలు అని ఎద్దేవా చేసి వారి నోరు మూతపడేలా సీఎం కేసీఆర్ ఫిట్‌మెంట్‌ని ప్రకటించారన్నారు టీఎన్జీవో సంఘాల నేతలు. 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటన అనంతరం హైదరాబాద్‌లోని టీఎన్‌జీవో కార్యాలయంలో, బీఆర్‌కే భవన్‌లో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్.. కరోనా కష్టకాలంలో కూడా ఫిట్‌మెంట్‌ ప్రకటించడం హర్షణీయమని చెప్పారు. సీఎం కేసీఆర్‌ గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌ ప్రకటించారని ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కష్టాన్ని తండ్రిలా పరిష్కరించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని టీఎన్జీవో నేత ముజీబ్‌ అన్నారు.

పెరిగిన పీఆర్సీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అన్ని విభాగాల ఉద్యోగులకు పీఆర్సీ వర్తిస్తుందని చేప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -