నిన్ను చూసి గర్విస్తున్నాం..!

83
boxer
- Advertisement -

హైదరబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్రాత్మక విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన 52 కేజీల ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో విజయం సాధించి బంగారు పతకం సాధించింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన జిట్‌పాండ్ జుటమాస్‌తో జరిగిన ఫైనల్‌లో 5-0 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఎమ్మెల్సీ కవిత … నిఖత్ జరీన్‌ను అభినందించారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం అని ట్వీట్ చేశారు.

- Advertisement -