పవన్ ఫ్యాన్స్‌పై ‘కత్తి’ సెటైర్

223
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై మువీ క్రిటిక్ కత్తి మహేశ్ మరోసారి సెటైర్లు విసిరాడు. ఇటీవల జబర్దస్త్ షోలో హైపర్ ఆది తనపై వేసిన సెటైర్లకు కత్తి ఘాటు సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్ని జరిగి కొన్నిరోజులు జరగక ముందే అదే ఆదితో కలిసి ఫోటో దిగి…పవన్‌ ఫ్యాన్స్‌కు ఉచిత సలహా పడేశాడు.

బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘లండన్ బాబులు’ ప్రీమియర్ షోకు పలువురు సినీ ప్రముఖులతో పాటు కత్తి మహేశ్, హైపర్ ఆది తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వీరు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆదితో దిగిన ఫొటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన  మహేశ్ పవన్‌ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశాడు.

కలిస్తే మేమూ మేమూ బాగానే ఉంటాం. విభేదాలు విషయాలకు సంబంధించి, పరిస్థితులకు లేదా సిద్దాంతాలు సంబంధించి ఉంటాయేగాని, వ్యక్తిగత వైరాలు ఉండవు. ఆ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచోళ్ళు నానా రభసా చేసి, వాళ్ళ జీవితాలు సంకనాకించుకుంటారు. రేపోమాపో పవన్ కళ్యాణ్‌ని కలిసినా ఇలా నవ్వుతూ ఫోటో దిగగలను. తరువాత వెధవలు అయ్యేది మీరే!” అంటూ పవన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  దీనిపై నెటిజన్ల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Kathi Mahesh Fires On Pawan Fans

- Advertisement -