బీఆర్ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్

50
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో వలసలు జోరందుకున్నాయి. తాజాగా టీటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్.సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుండి పెద్ద మనిషి కాసాని మన పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్‌లకు పెద్ద పీట వేస్తామని తెలిపారు.

ఈటల రాజేందర్‌ బీఆర్ఎస్‌లో ఎవరిని ఎదగనీయలేదన్నారు. ఎన్నికల తర్వాత ముదిరాజ్‌లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తానిన తెలిపారు.బండ ప్రకాష్ ముదిరాజ్‌ను తీసుకువచ్చి రాజకీయంగా పదవులుఉ ఇచ్చామన్నారు. ముదిరాజ్‌లకు వృత్తి పరంగా న్యాయం జరిగిందని తెలిపారు. తెలంగాణలోని 119 స్థానాల్లో 112 మన లెక్కలోకే వస్తామని గెలవని చోట ముదిరాజ్‌లను నిలబెట్టమని తెలిపారు.

పార్టీ లో చేరిన వారిలో..కాసానితో పాటు టిడిపి మాజీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్, బోయినపల్లి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పిడి గోపాల్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పనిచేసిన ప్రకాష్ ముదిరాజ్, టిడిపి రాష్ట్ర జనరల్ సెక్రటరీ బండారి వెంకటేష్ ముదిరాజ్, పటాన్ చెరువు కాంగ్రెస్ లీడర్ సపానాదేవ్ ముదిరాజ్, టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మేకల భిక్షపతి ముదిరాజ్, పుట్టిరాజ్ ముదిరాజ్, టిడిపి కరీంనగర్ నియోజవర్గ ఇంఛార్జ్ కనకయ్య ముదిరాజ్, టిడిపి ముషీరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ తలారి శ్రీకాంత్ ముదిరాజ్, టిడిపి బాన్సువాడ ఇంఛార్జి కరాటే రమేశ్ ముదిరాజ్, టిడిపి స్టేట్ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు చంద్రహాస్, ముదిరాజ్ మహాసభ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్ ముదిరాజ్, బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మంద శ్రీనివాస్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ నిజాంపేట్ నాయకుడు ఆంజనేయులు ముదిరాజ్, మేడ్చల్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు దొంతి నర్సింహులు ముదిరాజ్, టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.జగదీష్ యాదవ్, టిడిపి స్టేట్ సెక్రటరీ మన్నె రాజు, టిడిపి నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ జనరల్ సెక్రటరీ దూసకంటి వెంకటేష్, బాచుపల్లి మాజీ ఎంపిటిసి నందిగామ సత్యనారాయణ, టిడిపి నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ మైనార్టీ అధ్యక్షుడు లష్కర్ అశోక్ కుమార్, టిడిపి గుడి మల్కాపూర్ అధ్యక్షుడు అక్కెర శివరాజు ముదిరాజ్ తదితరులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్యే వివేకానంద తదితరులు పాల్గొన్నారు

తెలంగాణలో టీటీడీపీ పోటీకి దూరం అని ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు కాసాని. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ముదిరాజ్ సామాజిక వర్గంలో కాసానికి మంచి గుర్తింపు ఉంది.

Also Read:KCR:తెలంగాణలో శాశ్వతంగా కరెంట్ సమస్య ఉండదు

- Advertisement -