శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు..

348
karthika pournami
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నదీ స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులుతీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి, కృష్ణా నదీ తీరాల్లో కొలువుతీరిన ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివ నామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి.

యాదాద్రి, వేములవాడ, భద్రాచలం, బాసర, చెర్వుగట్టు రామలింగేశ్వరాలయం వంటి తదితర ఆలయాలకు భక్తజనం బారులు తీరారు.కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో… ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొంటున్నారు. కార్తీక దీపోత్సవంతో ఆలయాలన్ని శోభాయమానంగా వెలిగిపోతున్నాయి.

Karthika Pournami Heavy Rush at Temples
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో స్నానమాచరించిన భక్తులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి బారులుతీరారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట లాడుతోంది. భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి పోటెత్తారు. పరమశివుడు అనుగ్రహం కోసం భక్తులు భక్తిశ్రద్దలతో కార్తీక స్నానాలు ఆచరించారు. దీంతో గోదావరి ఘాట్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

- Advertisement -