మొక్కలు నాటిన కార్తీకదీపం ఫేం నిహారిక..

74
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు కార్తీకదీపం సీరియల్ ఫేమ్ నటి నిహారిక.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ పర్యవరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు.రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం తన సహా నటులు మనోహర్,ఐశ్వర్య,దేవరాజ్ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇచ్చారు నిహారిక.

- Advertisement -