ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత..హర్షణీయం: కర్నె ప్రభాకర్

263
karne
- Advertisement -

నిజామా బాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ టికెట్ మాజీ ఎంపీ కవితకు ఇవ్వడం హర్షణీయం అన్నారు ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్‌. అసెంబ్లీలో తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన…కవితకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ జాగృతి స్థాపించి తెలంగాణ ఉద్యమం లో కవిత కీలక పాత్ర పోషించారని…..తెలంగాణ ఉద్యమ కారిణి గానే కవిత 2014 లో నిజామాబాద్ ఎంపీగా గెలిచి అనేక సేవా కార్యాక్రమాలు చేపట్టారని తెలిపారు. గత ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమి పట్ల ప్రజలు , పార్టీ నేతలు చాలా భాదపడ్డారని తాజాగా ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడంతో పార్టీలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.

కవిత అభ్యర్దిత్వం విషయంలో రెండో మాటలేదు..అందరం స్వాగతించాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు బాలమల్లు ,మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -