కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్.డి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. బెంగుళూరులో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా కాంగ్రెస పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు హద్దులు దాటి వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ సీనియర్ నేతలు పరిస్థితిని చక్కదిద్దాలని.. లేదంటే తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న గొడవలు తనపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి ఎక్కి కొట్టుకుంటే వారికే నష్టమనీ, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల బెంగళూరు శివార్లలోని ఈగల్ టన్ రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేశ్, తోటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో బీజేపీ నేతలు గత కొద్ది రోజులుగా ఆపరేషన్ లోటస్ కార్యక్రమన్ని చేపడుతున్నట్లు చెప్పారు. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపరుస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి కుమారస్వామి.
#WATCH: Karnataka CM HD Kumaraswamy says "…If they want to continue with the same thing, I am ready to step down. They are crossing the line", when asked 'Congress MLAs are saying that Siddaramaiah is their CM'.' pic.twitter.com/qwErh4aEq4
— ANI (@ANI) January 28, 2019