13వ రోజు రైతు కూలీలకు అండగా ఎంపీ సంతోష్..

135
santhosh
- Advertisement -

దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా నిలవాలని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నడుం బిగించారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేంతవరకు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో కార్యాలయం యందు రైతులందరికీ, హమాలీ, చాట, సడెం, దడువాయి అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు . ఈ కార్యక్రమం 13వ రోజుకు చేరగా దీనిని ప్రారంభించారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి ఎలుక అనిత-ఆంజనేయులు గారు వైస్ ఛైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి గారు, బోయినిపల్లి జెడ్పిటిసి శ్రీమతి కత్తెర పాక ఉమ-కొండయ్య గారు,బోయినిపల్లి ఎంపీపీ వేణుగోపాల్ గారు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ కొలిపాక మల్లికార్జున్ గారు, శ్రీ చాట్లపల్లి పురుషోత్తం గారు,విలసాగర్ సర్పంచ్ అంజన్ రావు గారు మార్కెట్ కమిటీ సిబ్బంది , తదితరులు పాల్గొనడం జరిగింది.ఇంత గొప్ప అన్నదాన కార్యక్రమన్ని మన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహిస్తున్నందుకు రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీమతి శ్రీ ఎలుక అనిత ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -