గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ‘కరణ్ అర్జున్’ టీమ్‌..

25
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు బంజారాహిల్స్‌లో మొక్కలు నాటారు కరణ్ అర్జున్ చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవట్స, హీరో అభిమన్యు, నిఖిల్ కుమార్ నటి శైఫా, ఆకుల బాలకృష్ణ, రవి మేకల, ప్రవీణ్ పురోహిత్, అరుణ్ మాధవరం పాల్గొన్నారు.

చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవట్స,నటి శైఫా మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పచ్చదనం పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఒక మొక్కను నాటితే ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళము అవుతామని.. అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -