వెంకన్న…పెద్దల దేవుడు

223
Kanimozhi shocking comments on Lord Venkateswara
- Advertisement -

కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిపై డీఎంకే నేత కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకన్న కేవలం కోటీశ్వరుల దేవుడని, పేదలను కాపాడలేడని ఆమె పేర్కొన్నారు. సొంత హుండీనే కాపాడలేని దేవుడు భక్తులను ఎలా కాపాడుతాడు అని ప్రశ్నించారు.

తిరుమలేశుడికి శక్తులే ఉంటే ఆయనకు భద్రత ఎందుకు? ఎందుకు అంటూ తిరుచ్చిలో జరిగిన నాస్తిక సమాజం మహానాడులో కనిమొళి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలూ మానవులను విడగొడుతున్నాయని, నాస్తికవాదమే మానవ జాతి కలిసి ఉండేలా చేస్తుందని తెలిపారు.

చరిత్ర చూస్తే.. యుద్ధాల కంటే మతాల వల్ల చిందిన రక్తమే ఎక్కువ. ఈ ఘర్షణలను నిర్మూలించాలంటే మానవతావాదాన్ని, నాస్తికవాదాన్ని వ్యాపింపజేయాలని అని కనిమొళి వ్యాఖ్యానించారు. వెంకన్నపై కనిమొళి చేసిన వ్యాఖ్యలపై హిందూమక్కల్‌ కట్చి మండిపడింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు.

- Advertisement -