బాల్ టాంపరింగ్ వివాదం క్రికెట్ వ్యవస్థని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే డేవిడ్ వార్నర్ ఐపీఎల్ కు దూరమయ్యాడు. అయితే వార్నర్ ప్లేస్ లో సన్రైజర్స్ నూతన సారథిగా కేన్ విలియమ్సన్ సెలెక్ట్ అయ్యాడు. కేన్ ను నియమిస్తూ..సన్రైజర్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
కేప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఇప్పటికే విలియమ్స్ తెలిపిన నేపథ్యంలో ఈ అవకావం దక్కింది. కాగా…కెప్టెన్గా బాధ్యతలు చేపటడ్డం ఆనందంగా ఉందని కేన్ తెలిపాడు.
ఇదిలా ఉండగా..కెప్టెన్సీ రేసులో కేన్ విలియమ్సన్ తో పాటు షకీబుల్ హసన్, ధావన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ విలియమ్సన్కు న్యూజిలాండ్ జట్టు కెప్టెన్గా అనుభవం ఉండటంతో కేన్ వైపే హైదరాబాద్ ఫ్రాంచైజీ మొగ్గు చూపించింది.
Kane Williamson has been appointed as captain of SunRisers Hyderabad for IPL 2018. pic.twitter.com/b5SMK8086U
— SunRisers Hyderabad (@SunRisers) March 29, 2018