- Advertisement -
నేటి నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. నేటి నుంచి అక్టోబర్ 8వరకు10రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. పది అవతారాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈసందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరకుంటున్నారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీఐపీ భక్తులకు ప్రత్యేక దర్శన సమయాలు కేటాయించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈరోజు సాయంత్రం అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏపీ ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను ఏపీ సీఎం జగన్ రేపు సమర్పించనున్నారు.
- Advertisement -

