విద్యార్థుల మధ్య మత విద్వేశాలా?: కమల్ హాసన్

54
kamal
- Advertisement -

అమాయక విద్యార్థుల మధ్య బీజేపీ నేతలు మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు సినీ నటుడు కమల్ హాసన్. క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకుంటున్న తాజా ప‌రిణామాలు అల‌జ‌డి రేపేలా ఉన్నాయని కమల్ వెల్లడించారు.

పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతున్న ఇటువంటి ప‌రిణామాలు త‌మిళ‌నాడు వ‌ర‌కు పాకకుండా చూసుకోవాలని… త‌మిళ‌నాడులో ప్రగతిని కోరుకునే వారు ఇటువంటి స‌మ‌యంలో మ‌రింత అప్రమ‌త్తంగా ఉండాలని క‌మ‌ల్ హాస‌న్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ కాలేజీలో ప్రారంభమైన హిజాబ్ వివాదం నెమ్మదిగా చిక్ మంగుళూరు, బెళగావి, కొప్పెల, మాండ్య జిల్లాలకు సైతం పాకింది. దీంతో ఓ వర్గం విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువాలు కప్పుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.

- Advertisement -